పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా- పాకిస్థాన్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రదాడి ఘటనతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారతదేశం సింధూ జలాల ఒప్పందం అమలుు నిలిపివేస్తే.. పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇరుదేశాల సైన్యం తీసుకుంటున్న చర్యల కారణంగా సరిహద్దుల్లో ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.