తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని చెప్పింది. అవసరమైతే పాత పద్ధతిలోనే, 50 శాతం పరిమితికి లోబడి ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని సూచించింది. హైకోర్టు స్టేను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.