హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గించి, ఉత్తర తెలంగాణకు ప్రయాణాన్ని వేగవంతం చేసే పారడైజ్-శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.2,232 కోట్లతో 18.5 కి.మీ. పొడవున నిర్మించే ఈ ప్రాజెక్టుకు టెండర్లు ఖరారయ్యాయి. వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి. భూసేకరణ, చెట్ల తరలింపు పూర్తయ్యాయి. ఈ కారిడార్ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రాకపోకలను సులభతరం చేస్తుంది.