హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు చేపట్టింది. రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాలలో 19,878 గజాల విలువైన 4 పార్కు స్థలాలను కాపాడింది. రూ. 139 కోట్లకు పైగా విలువైన స్థలాలను ఆక్రమణల నుంచి విడిపించింది. ఆక్రమణదారుల కట్టడాలను కూల్చివేసి, స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.