హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఈ ఎన్నికలు గనుక పార్టీ గుర్తుపై జరిగి ఉంటే గులాబీ దళం అసలు సత్తా ఏంటో తెలిసేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల గర్వంతో వ్యవహరిస్తోందని.. వారి రెండేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల కోసం పోరాడుతామని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతామని చెప్పారు.