పార్టీ పెట్టకముందే మున్సిపల్ ఎన్నికల బరిలో కవిత..! పోటీలో తెలంగాణ జాగృతి నేతలు?

1 month ago 5
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రచారం జరిగింది. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో.. తెలంగాణ జాగృతి నేతలు బరిలోకి దిగే అవకాశం ఉందని.. ఈ మేరకు కవిత కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Read Entire Article