పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం రోజున అఖిల పక్ష భేటీ నిర్వహించింది. ఈ భేటీలో టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటే విభజన చట్టంలో సవరణ చేయాలి. ఈ సవరణకు న్యాయశాఖ ఇటీవలే ఆమోదం కూడా తెలిపింది.