Mobile Passport Vehicle Services: ఆంధ్రప్రదేశ్లో పాస్పోర్ట్ సేవలు మరింత చేరువయ్యాయి. ఇకపై మారుమూల ప్రాంతాల ప్రజల కోసం మొబైల్ పాస్పోర్ట్ వాహనం అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మరోవైపు లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. విద్యుత్, బ్యాంకింగ్, బీమా రంగాల సంస్థలతో కమిటీ చర్చిస్తోంది. ఏపీఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్లుగా 14 మందిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.