విశాఖపట్నంలో నగదు వివాదంలో కిడ్నాప్కు గురైన ప్రమీల, తెలివిగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకువచ్చిన కిడ్నాపర్లకు, పిల్లలు ఆడుకునే డబ్బుల కట్టలను ఇచ్చి, వారు లెక్కపెడుతున్న సమయంలో తప్పించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తీసుకున్న డబ్బులు చెల్లించలేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.