కొత్త తరహా కథలతో రూపొందే డివోషనల్ థ్రిల్లర్స్కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఇప్పుడు అదే తరహాలో ఓ ఇంట్రెస్టింగ్ డివోషనల్ కథతో రూపొందుతున్న సినిమా 'షణ్ముఖ' కూడా ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతోంది. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'షణ్ముఖ'. అనే పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.