Pesticides Management Bill: నకిలీ పురుగుమందుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. 'పురుగుమందుల నిర్వహణ బిల్లు, 2025' ముసాయిదా ప్రకారం, నకిలీ మందులు వాడితే రూ.50 లక్షల వరకు జరిమానా లేదా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ బిల్లు రైతులకు నాణ్యమైన పురుగుమందులు అందేలా చూడటంతో పాటు, వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచుతుందని భావిస్తోంది. ఈ ముసాయిదాపై ఫిబ్రవరి 4లోపు అభిప్రాయాలు, సూచనలు పంపాల్సిందిగా కేంద్రం కోరింది.