Poosapati family 1000 crore land GMR Mansas Edu city: విశాఖపట్నం - విజయనగరం సరిహద్దుల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే ఒప్పందం కుదిరింది. జీఎంఆర్ గ్రూప్ - మాన్సాస్ ట్రస్టు ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కోసం మాన్సాస్ ట్రస్టు తరుఫున రూ.1000 కోట్లు విలువైన 136.63 ఎకరాల భూమిని దానంగా ఇచ్చేందుకు పూసపాటి వంశీయులు అంగీకరించారు. ఈ ప్రాజెక్టుకు తమ వంశీయుడైన అలక్ మహారాజా గజపతి పేరు పేట్టాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరుతున్నారు.