రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. వదంతుల కారణంగా ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తడంతో.. ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో ఇంధన కొరతపై అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.