పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కారు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కంటే ఎక్కువ లీటర్ల పెట్రోల్ను పోసినట్లు.. బంక్ సిబ్బంది బిల్లు రశీదు ఇవ్వడంతో ఓనర్ ఖంగుతిన్నాడు. అలా ఎలా పోస్తారని బంక్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ కారు ఓనర్.. సంబంధిత అధికారులు పట్టించుకుని, ఇలాంటి మోసాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశాడు.