వివాహానికని బయలుదేరిన పెళ్లి బృందానికి ఘోర రోడ్డు ప్రమాదం ఎదురైంది. హనుమకొండ జిల్లాలో లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంతోషంగా సాగాల్సిన ప్రయాణం మృత్యు ఒడిలోకి చేరింది.