మహబూబ్నగర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కడుపు నిండా తిండి లేక, అనారోగ్యంతో దివ్యాంగుడైన కుమారుడు మరణించడంతో అంత్యక్రియలకు డబ్బుల్లేక తండ్రి మృతదేహాన్ని భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్లాడు. సాయం చేసే వారు లేకపోవటంతో ఐదు గంటల పాటు శ్మశానంలోనే ఏడుస్తూ ఉండిపోయాడు. స్థానికుల సాయంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకోగా.. ఆ తండ్రి పడిన ఆవేదన అందరినీ కంటతడి పెట్టించింది.