తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కేరళలోని 'కుటుంబశ్రీ' తరహా ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా అత్యంత పేదలను గుర్తించి వారికి ఇళ్లు, ఉపాధి, వైద్యం వంటి కనీస అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకోనుంది. ఇది ఆర్థిక సహాయంతో పాటు సామాజిక బలోపేతానికి దోహదపడుతుంది.