నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ప్రతిపాదన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ అధికారంలోకి వస్తే పేరు మారుస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తాజాగా ప్రకటించారు. నిజాం పాలన ఆనవాళ్లను తొలగించి, చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.