పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2026 మార్చి నాటికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు, పునరావాసం వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల రూ. 30,436.95 కోట్లతో కొత్త డీపీఆర్ను కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించింది. దీని వల్ల ఈ ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేయడానికి రూ. 12,157 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇందుకు సంబంధించిన నిధులు కేంద్రం విడుదల చేసింది.