తెలంగాణలో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. ప్రభుత్వ పిలుపుతో జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. వీరిలో కొందరు దశాబ్దాలుగా పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు కూడా ఉన్నారని తెలిపారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల్లో విభేదాలు పెరిగాయని.. రానున్న రోజుల్లో మరికొందరు కూడా లొంగిపోయే అవకాశం ఉందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. మిగతా వారు కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు.