సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును కాజేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన రాజేష్ను పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.