తెలంగాణ పోలీసులు ఇకపై ఇంటికే వచ్చి ఫిర్యాదులు స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు, మహిళలకు ఇది పెద్ద ఊరట. హైదరాబాద్ నగరంలో 'సీ-మిత్ర' కార్యక్రమం ద్వారా సైబర్ బాధితులకు AI సాయంతో లీగల్ డ్రాఫ్ట్లు అందించి, FIR నమోదు చేస్తున్నారు. ఈ వినూత్న విధానం ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.