హైదరాబాద్ నగరంలో పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తూ.. కొత్త స్టేషన్లను ఏర్పాటు చేస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 35 ఏళ్ల తర్వాత జరిగిన ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టోలిచౌకిలో కొత్త లా అండ్ ఆర్డర్ పీఎస్గా ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్, హుమాయున్నగర్, షాహినాయత్గంజ్ పీఎస్ల పేర్లను మార్చారు. 146 మంది సీఐలను బదిలీ చేయడంతో పాటు.. కొత్తగా 1200 మంది సిబ్బందిని, 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను మంజూరు చేశారు.