Gen Z Post Office at Amaravati:యువతను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 50 'జెన్-జెడ్' పోస్టాఫీసులను ఏర్పాటు చేస్తోంది. అమరావతిలోని విట్ క్యాంపస్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒకదాన్ని ప్రారంభించారు. వీటిల్లో గేమ్స్, ఉచిత వైఫై, పార్శిల్ ఛార్జీల్లో డిస్కౌంట్లు వంటి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎక్కువ శాతం విద్యాసంస్థల ప్రాంగణాల్లో వీటిని నెలకొల్పుతున్నారు. ఏపీలో ఇప్పటికే రెండు చోట్ల వీటిని ప్రారంభించగా.. త్వరలోనే కర్నూలులో కూడా ప్రారంభించబోతున్నారు.