ప్రకృతి ప్రేమికులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కేరళలో ఉండే అందాలను, ప్రకృతి రమణీయతను.. ఏపీలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. కేరళ తరహాలో జలవిహారం చేయడంతోపాటు.. రాత్రి పూట బోటులోనే బస చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బెర్మ్ పార్కు, సూర్యలంక బ్యాక్ వాటర్లలో లగ్జరీ బోట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు.. అనుమలు ఇచ్చింది. వచ్చే ఏడాది అక్టోబరుకల్లా విలాసవంతమైన పడవలు అందుబాటులోకి వస్తాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి