Eluru District 22a Lands Problem Solved: ఆంధ్రప్రదేశ్లో 22ఏ జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల సమస్యలకు ఏలూరు జిల్లాలో కీలక పరిష్కారం లభించింది. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేల సమక్షంలో బాధితుల వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇకపై ప్రతినెలా గ్రీవెన్స్ నిర్వహిస్తామని, నిషేధిత జాబితా నుంచి తొలగించిన సర్వే నంబర్లను వెబ్సైట్లో చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహాలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.