హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకు రూ.కోటిన్నర నష్టం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో టికెట్ ధరలు పెంచాలని మెట్రో రైలు సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ప్రయాణికులపై భారం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలిసింది. నష్టాలు వస్తున్నా, ధరలు పెంచే ఆలోచన లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం.