హైదరాబాద్ మూసీ నదికి పునర్జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2026 ఉగాది పండుగ రోజున ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. దీనితో పాటు గాంధీజీ బోధనలను వివరించే అత్యాధునిక ప్రదర్శనశాలను కూడా నిర్మిస్తారు. మొదటి దశలో 9 కిలోమీటర్ల మేర అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు సుమారు 4,100 కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు ముందుకొచ్చింది.