తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు మాత్రం ప్రజలను పీడిస్తూనే ఉన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60 వేలు లంచం అడిగిన ఓ గ్రామ పంచాయతీ అధికారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇలాంటి ఘటనలపై ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.