ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్కు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా శాశ్వత పేస్మేకర్ అమర్చారు. సుమారు 3.5 లక్షల విలువైన ఈ క్లిష్టమైన సర్జరీని ప్రభుత్వ ఆసుపత్రిలోనే విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. పేదలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని పెంచే ఈ ఘటన.. కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.