తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1 కోటి ప్రమాద బీమా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులతో ప్రారంభమైన ఈ పథకాన్ని అన్ని ప్రభుత్వ శాఖలకు విస్తరించనున్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.