తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభవార్త తెలిపారు. రాష్ట్రంలోని 5.14 లక్షల మంది శాశ్వత ఉద్యోగులకు రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.