తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 3,574 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఎస్హెచ్ఎంలుగా పదోన్నతులు లభించాయి. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతుల ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ఊపందుకుంది. ప్రమోషన్లపై ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.