ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు చేతివాటం చూపించాడు. అనంతపురం జిల్లాలో ఓ టీచర్.. తన ప్రైవేటు కోచింగ్ సెంటర్ విద్యార్థుల పేర్లను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేశాడు. అయితే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల సొమ్మును కాజేసేందుకు ఇలా చేస్తున్నట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. డీఈఓ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది.