ఇటీవల తెలంగాణలో అకాల వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తాజాగా పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. తుది నివేదిక అనంతరం పంట నష్టం పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.