హైదరాబాద్ నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తన సొంతూరు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నేదునూరులో.. తన సోదరి ఫామ్ హౌస్కు వెళ్లిన ఆయన అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డారు. రాంరెడ్డి తన భాగస్వాములతో కలిసి పటాన్చెరులో 280 ఎకరాల్లో భారీ వెంచర్ వేశారు. ఇందుకోసం వంద కోట్లకుపైగా అప్పులు తెచ్చారు. అయితే 1968 నాటి లింక్ డాక్యుమెంట్లు లేకపోవడం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది.