ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించడానికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ముంబై, ఢిల్లీ, పూణె, హౌరా నుంచి హైదరాబాద్కు 89 ప్రత్యేక రైళ్లు.. అదనపు కోచ్లతో కూడిన రైళ్లు నడుపుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే.