Escalators Arranged at Kazipet Railway Station: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకం చేపట్టింది. తెలంగాణలో 42 స్టేషన్లు ఆధునీకరించనుండగా, కాజీపేటలో ఎస్కలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటుగా కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మొదలు పెట్టగా.. దీని పనులు వేగంగా జరుగుతున్నాయి. కొమురవెల్లి మల్లన్న స్టేషన్ పనులు 95 శాతం పూర్తయ్యాయి. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని అధికారులు తెలిపారు.