తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం హెలీ టూరిజం సేవలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఈ సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ద్వారా 5-6 గంటల రోడ్డు ప్రయాణం గంటలోపు పూర్తి చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నల్లమల అడవుల అందాలను ఆకాశం నుంచి చూసే అద్భుతమైన అనుభూతి పర్యాటకులకు లభిస్తుంది.