ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ చివరి శ్వాస వరకు బాధ్యతగా వ్యవహరించాడు. విజయవాడ-1 డిపోకు చెందిన డ్రైవర్ ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ.. 19 మంది ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. బస్సును మెయిన్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం గుండెపోటుతో మృతి చెందాడు. తమను కాపాడిన డ్రైవర్ను ప్రయాణికులు బరువెక్కిన హృదయంతో గుర్తుచేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.