ప్రాణం మీదకు తెచ్చిన రీల్స్ మోజు.. దొరకని యువకుడి ఆచూకీ

4 months ago 9
రీల్స్‌పై మోజు ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. జలపాతంలో దూకుతూ దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేయాలని ఆశపడ్డాడు ఆ యువకుడు. కానీ, జలపాతంలో దూకిన తర్వాత గల్లంతయ్యాడు. రెండు రోజులు గడుస్తు్న్నా ఆ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరు పట్టణంలోని ఓ చికెన్‌ షాపులో పనిచేసే 24 ఏళ్ల యూనస్‌ ఈనెల 16వ తేదీన స్నేహితులతో కలిసి కల్యాణరేవుల జలపాతానికి వెళ్లాడు. రీల్స్‌ కోసం విన్యాసాలు చేసేందుకు పెద్ద బండరాయి మీది నుంచి దూకి తిరిగి పైకి రాలేదు. ఆ రాయి అంచు వరకు వచ్చి గల్లంతయ్యాడు. రెండు రోజుల నుంచి గాలిస్తున్నా యూనస్ ఆచూకీ లభించలేదు. నీటి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువ కావడం, యూనస్‌ గల్లంతవ్వడంతో కల్యాణరేవుల జలపాతం వద్దకు పర్యాటకులకు అనుమతిని అధికారులు నిషేధించారు. ప్రస్తుతం యూనస్, స్నేహితులు తీసుకున్న ఫొటోలు.. దూకేందుకు రెండు నిమిషాల ముందు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూనస్ నీటిలో నుంచి తిరిగి పైకి చేరుతున్న క్రమంలో కనిపించకుండా పోయాడని, ఈ నేపథ్యంలో ఎవరినీ అనుమతించడం లేదని పలమనేరు అటవీ శాఖ అధికారి నారాయణ తెలిపారు. ఊసరపెంట వద్ద సిబ్బందిని కాపలా ఉంచినట్లు చెప్పారు.
Read Entire Article