Andhra Pradesh Rah Veer Schemeఫ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేసేవారిని 'రాహ్వీర్లు'గా గుర్తించి, కేంద్రం ప్రోత్సహిస్తోంది. వీరికి రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు. పోలీసు కేసుల భయం లేకుండా సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడేవారిని గుర్తించి, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే ఈ పథకం లక్ష్యం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.