తెలంగాణలో ప్రైవేట్ కళాశాలల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. పెండింగ్లో ఉన్న దాదాపు రూ.1,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి నాటికి రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరకపోతే.. ఈ నెల 23వ తేదీ నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు తిరిగి బంద్ పాటిస్తాయని సమాఖ్య హెచ్చరించింది.