హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫేస్బుక్ పరిచయంతో ఏకంగా రూ. 2.14 కోట్లు పోగొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయన్న ఓ మహిళ మాటలు నమ్మి.. బాధితుడు నకిలీ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడులు పెట్టారు. యాప్లో కనిపించే వర్చువల్ లాభాలను నిజమని నమ్మి, ఆస్తులు అమ్మి మరి 8 విడతల్లో డబ్బు చెల్లించారు. చివరకు విత్డ్రా కోసం అదనపు నగదు అడగడంతో మోసాన్ని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.