ఫోన్ చోరీ చేశాడని నరకం చూపించారు.. రెండు రోజులు ఎనిమిది మంది కలిసి.. చివరకు పాపం..

2 months ago 4
మొబైల్ ఫోన్ దొంగలించాడన్న అనుమానంతో ఓ కూలీని.. ఎనిమిది మంది వ్యక్తులు దారుణంగా చావబాదారు. రాడుతో కొట్టి ఏకంగా హత్య చేశారు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు.. రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి.. రిమాండ్‌కు తరలించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చంద్రబావి నగర్‌కు చెందిన మహిపాల్ అనే వ్యక్తి హిందూపురంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇతను రోజువారి పని చేసుకుని హిందూపురంలో ఉన్న సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్‌లో రాత్రి సమయంలో పడుకునేవాడు. డిసెంబర్ 23వ తేదీన వాసు కుమార్ అనే వ్యక్తి.. ఇదే బెడ్డింగ్ సెంటర్‌కు వచ్చి నిద్రించాడు. ఉదయం లేవగానే అతను మొబైల్ ఫోన్ కనబడలేదు. దీంతో పక్క బెడ్‌లో పడుకున్న డ్రైవర్ మహిపాల్‌పై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వాసు కుమార్ తన స్నేహితులతో కలిసి మహిపాల్‌తో గొడవపడ్డాడు. మద్యం మత్తులో వారు దాడి చేయటంతో దెబ్బలు తట్టుకోలేక మహిపాల్ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎనిమిది మంది నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Read Entire Article