తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదని.. దేశ భద్రత మరియు ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే చట్టబద్ధమైన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే దీనికి చట్టబద్ధత ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ తప్పు కాదని అన్నారని.. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.