మెదక్ జిల్లాలో మొబైల్ ఫోన్ మితిమీరిన వాడకం ఒక యువతి ప్రాణాన్ని బలితీసుకుంది. తల్లి మందలించిందన్న కోపంతో ఓ 19 ఏళ్ల యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువతి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.