హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలోని చింతల్కుంటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సుధేష్ణ అనే మహిళ.. తన ఏడు తులాల బంగారు ఆభరణాలు కనిపించకుండాపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్తో కలిసి మూడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో సుధేష్ణ చికిత్స పొందుతూ మరణించగా.. బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.