పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతపవనాల రాకతో తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షానికి ఛాన్స్ ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.