బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సోమవారం పలు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు మంగళవారం వరకూ చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది.